నేటి సాక్షి, కుమ్రంభీం ఆసిఫాబాద్: జిల్లా వ్యాప్తంగా సావంతా మాలీ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. వాంకిడి మండలంలోని తెజీగూడలో కృష్ణ మందిరంలో జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సావంతా మాలీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండలాల అధ్యక్షులు గురునులే నారాయణ, మసదే చరణ్, నాయకులు షేక్ కలీం, సమేల రమేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



