Monday, January 19, 2026

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

నేటి సాక్షి, రామగిరి : అక్రిడిటేషన్​ కార్డులతో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులో రాయితీ ఇవ్వాలని డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్​ నాయకులు రామగిరి నాయబ్​ తహసీల్దార్​ యజ్ఞంభట్ల మానసకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. డీజేఎఫ్​ జాతీయ అధ్యక్షుడు మనసాని కృష్ణారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు మోటాపలుకుల వెంకట్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కళ్లేపల్లి కుమార్​, ఉపాధ్యక్షుడు కన్నూరి రాజు ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. అక్రమ కేసుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి సబితం లక్ష్మణ్, ప్రధానకార్యదర్శి బోయిని ప్రసాద్, కోశాధికారి పెయ్యాల రమేష్, సభ్యులు సిద్ధం ప్రదీప్ కుమార్, దాసరి భరత్, ఐలి సాయి కృష్ణ తదితర పాత్రికేయులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News