- – జగిత్యాల కలెక్టర్బీ సత్యప్రసాద్
- – ప్రజావాణిలో 22 ఫిర్యాదుల స్వీకరణ
నేటి సాక్షి, జగిత్యాల: ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యమిచ్చి, క్షేత్ర స్థాయిలో పరిశీలించి, వెనువెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను జగిత్యాల కలెక్టర్ బీ సత్యప్రసాద్ ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 22 అర్జీలు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు మధుసూదన్, శ్రీనివాస్, జివాకర్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో హన్మంత రావు, వివిధ జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

