- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ :
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం 24వ వార్డు నందు శ్రీ ఆంజనేయ స్వామి గుడి కాంపౌండ్ వాల్ కు భూమి పూజ చేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఐదు లక్షలు వ్యయంతో కాంపౌండ్ వాల్ కు నిధులు మంజూరైనట్లు 24 వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాసులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గద్వాల పట్టణ వివిధ వార్డుల కౌన్సిలర్లు, 24వ వార్డు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

