Wednesday, January 21, 2026

అల్ఫోర్స్ జీనియస్ స్కూల్లో ముందస్తు నూతన సంవత్సర సంబరాలు

నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత అయిన డాక్టర్ వి నరేందర్ రెడ్డి నూతన సంవత్సరం పురస్కరించుకొని హుజురాబాద్ లోని ఆల్ఫోర్స్ జీనియస్ స్కూల్లో ముందస్తు నూతన సంవత్సర సంబరాలు జరిపినారు. దానిలో భాగంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో నూతన సంవత్సరం వేడుకలు విద్యార్థులకు ఉత్తేజాన్ని స్ఫూర్తిని నింపే విధంగా సంబరాలు జరిపినారు. విద్యార్థులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలపడం, మంచి ఆశయాలు, సంకల్పాలు పంచుకునే అవకాశం కల్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, నృత్యాలు, నాటికలు ప్రదర్శించారు. నూతన సంవత్సరానికి సంబంధించిన స్ఫూర్తిదాయక ప్రసంగాలు విద్యార్థుల ద్వారా ప్రధానోపాధ్యాయులు లేదా ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు నూతన సంవత్సరానికి సంబంధించిన స్ఫూర్తిదాయక సందేశం అందించారు. ప్రతి విద్యార్థి తాను మంచి పౌరుడిగా ఎదగాలని ప్రేరణ ఇవ్వడం జరిగింది. వేడుకలను సరదాగా, ఉల్లాసంగా నిర్వహించడంతో పాటు విద్యార్థులకు విద్యా, శీల సముపార్జనపై దృష్టి పెట్టాలని, అన్ని వయసుల విద్యార్థులు పాల్గొనేలా ప్రణాళిక పొందించాలని, నూతన సంవత్సరం విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఒక కొత్త దశగా ఉండాలని చూసుకోవాలని పేర్కొన్నారు. మన జీవితాన్ని అందంగా తీర్చిదిద్దే అవకాశం ప్రతి నూతన సంవత్సరంలో ఉందని, దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పలువురు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News