Wednesday, January 21, 2026

దాతల సహకారంతో 1349 రోజులుగా పేదలకు అన్నదానం

  • మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్..

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ:
మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1349 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున లక్ష్మీ గణపతి, రాజన్న, భీమేశ్వర ఆలయాల వద్ద పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ట్రస్ట్ సభ్యులు మధు మహేష్ తెలిపారు. గురువారం అన్నదాతలుగా ఏలేశ్వరపు సాయినాథ్ సుప్రజ దంపతులు, జువ్వాడి స్నేహాలత వెంకటేశ్వరరావు దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు, గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత, కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్ చంద్ర దంపతులు, శిరీష సాయిచంద్ర దంపతులు, శర్వాణి రవిచంద్ర దంపతులు ఉన్నారని అన్నదాన కార్యక్రమానికి సహకారం అందించాలను కునే అన్నదాతలు ట్రస్టు సభ్యులను గాని ట్రస్టు ఫోన్ నం 9246939388 ద్వారా సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మహేష్ కోరారు. అన్నదాన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, డాక్టర్. బెజ్జంకి రవీందర్, వొడ్యాల వేణు, పొలాస రాజేందర్, గొండ ప్రసాద్, పసుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News