- ప్రభుత్వం సావిత్రి బాయి జయంతి అధికారికంగా జరపడం అభినందనీయం
- అంబేద్కర్ సంఘం పట్టణ అధ్యక్షుడు తొగరు రాజు
నేటి సాక్షి, లక్షెట్టిపేట (బైరం లింగన్న) :
మహిళా హక్కులకై పోరాడిన వీర వనిత, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలని అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు తోగరు రాజు అన్నారు. శుక్రవారం పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద సావిత్రిబాయి పూలే జయంతిని నాయకులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో మొట్టమొదటి సారిగా మహిళలకు, దళితులకు, గిరిజనులకు, వెనకబడిన తరగతులకు అందరికీ విద్య అందించిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అన్నారు. బాలిక విద్య, వితంతు విద్య, కోసం ఎన్నో పాఠశాలల నెలకొల్పిందన్నారు. ఆమె ఆశయాలను కొనసాగించడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు చొప్పదండి రమేష్,జిల్లా నాయకులు మాలెం చిన్నన్న, ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి రమేష్, చాతరాజు రాజేష్, మామిడి సన్నీ, కండె మొగిలి, అడ్లురి శివ, బానేష్ మేకల, మినుముల వేణు, మంచాల కుమార్, మొగిలి, ప్రదీప్, జోసెఫ్ , చుంచు సతీష్, నవీన్ తరులు పాల్గొన్నారు.

