- డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు

నేటి సాక్షి, జమ్మికుంట : జమ్మికుంట పట్టణంలో శుక్రవారం రోజున ప్రైవేట్ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న లలిత డెంటల్, బిట్లాస్ డెంటల్, మమత డెంటల్, పి ఆర్ కె డెంటల్, దుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లను పరిశీలించిన డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేషెంట్స్ కు సరైన సౌకర్యాలు కల్పించాలని వారిని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయరాదని అన్నారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించకూడదని ప్రభుత్వ నిబంధనలకు లోబడి వైద్యం అందించాలని, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ లేకుండా ఆస్పత్రులు నడిపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆసుపత్రి ప్రతినిధులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్యాం నాయక్,డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

