Wednesday, January 21, 2026

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఇవ్వాల్సిన సీఎంఆర్ ధాన్యాన్ని రైస్ మిల్లర్లు వెంటనే పూర్తి చేయాలి

  • అదనపు కలెక్టర్ రెవెన్యూ జీ వెంకటేశ్వర్లు

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి :
శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సీ.ఎం.ఆర్ ధాన్యం విషయంపై రైస్ మిల్లర్ల తో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 2023-2024 రబీ సీజన్ కు సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఇవ్వాల్సిన సీఎంఆర్ ధాన్యాన్ని జనవరి 25 లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. అదేవిధంగా 2024-2025 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి సివిల్ సప్లై కార్పొరేషన్ కు ఇవ్వాల్సిన సీఎంఆర్ ధాన్యాన్ని కూడా రైస్ మిల్లర్లు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోపు మిల్లర్లు ధాన్యాన్ని అప్పగించకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మిల్లర్లు నిర్లక్ష్య ధోరణి వీడి సీఎంఆర్ ధాన్యాన్ని అప్పగించి చట్టపరమైన చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.ఇంకా చాలామంది మిల్లర్లు ఎంత చెప్పినా బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం లేదని, అదే ధోరణి కొనసాగితే ధాన్యాన్ని ఇతరులకు షిఫ్టింగ్ చేయడానికి వెనుకాడబోమని తెలిపారు. సమావేశంలో సివిల్ సప్లై అధికారి కాశీ విశ్వనాథ్, సివిల్ సప్లై డిఎం రమేష్, రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, స్టేట్ ట్రెజరర్ వెంకటరమణ విశ్వనాథం, కట్ట సుబ్బయ్య, నరేందర్ రెడ్డి, వావిద్, నాగన్న యాదవ్ రైస్ మిల్ అసోసియేషన్ మెంబర్స్, డీటీ లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News