నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని రాయచూరు రోడ్డు కెవిఆర్ కాంప్లెక్స్ నందు బుధవారం “అపోలో మెడికల్” గ్రాండ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. నాణ్యమైన మందులు సరసమైన ధరలకు లభించును, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన కంపెనీ మెడిసిన్ తో పాటు జనరల్ ఐటమ్స్ కొనుగోలుపై డిస్కౌంట్, అఫర్లు గలవు. ప్రతిరోజు ఉదయం 7:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. కావున మందులు అవసరం ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అపోలో సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో అపోలో మెడికల్ హైదరాబాద్ డిజిఎం చరణ్ కుమార్ గౌడ్, మేనేజర్స్ రామ్ కుమార్, లోకల్ మేనేజర్ చక్రవర్ధన్ రెడ్డి, కె.వి.ఆర్ కాంప్లెక్స్ యాజమానులు హోటల్ వెంకటమ్మ, ఎగ్జిక్యూటివ్ నారాయణ, స్టాఫ్ మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు





