నేటి సాక్షి,కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి): కోరుట్ల పట్టణంలోని కేశవ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న గంగు అనే మహిళ పేషంట్ అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం అవ్వగా కోరుట్ల సేవాదల్ అధ్యక్షుడు పుప్పాల నాగరాజు ద్వారా విషయం తెలుసుకున్న కోరుట్ల సేవాదళ్ సభ్యుడు అన్నాడి ప్రశాంత్ రక్తదానం చేశారు. ఇది తన 12వ రక్తదానం అని తెలిపారు.ఈ సందర్భంగా రక్త దానం చేసిన ప్రశాంత్ ని హాస్పిటల్ సిబ్బంది, మరియు రోగి బంధువులు, తదితరులు అభినందించారు.





