నేటిసాక్షి, ఇబ్రహీంపట్నం:
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఇబ్రహీంపట్నం, వేములకుర్తి ,గోదుర్, ఎర్దండి తదితర గ్రామాలకు చెందిన అయ్యప్పస్వామి దీక్షాపరులు 41 రోజులపాటు దిక్ష చేసి శబరిమల యాత్ర చేయగా ఆదివారం అయ్యప్ప స్వామి దర్శనం కోసం కేరళ రాష్ట్రంలోని ఎరిమేలి ప్రాంతంలో పెద్ద పాదం వనయాత్రను ప్రారంభించారు. మొట్టమొదటిసారి దీక్ష తీసుకున్న కన్నె స్వాములను గురుస్వాములు సహకారంతో యాత్ర చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మండల అయ్యప్పస్వామి దీక్షాపరులు తదితరులు పాల్గొన్నారు.





