నేటి సాక్షి, కోటపల్లి;
నాగంపేట, బొప్పారం గ్రామ శివారూలో ఉన్న అటవీ ప్రాంతంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారని ముందస్తు సమాచారం మేరకు ఆదివారం కోటపల్లి ఎస్సై రాజేందర్ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు పది కోళ్ళు, ఏడు మొబైల్స్, రూ.59780 నగదును అలాగే వాటితో పాటు 4 బైక్లు సీజ్ చేసి పందేం రాయుళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.





