59,390 రూపాయాల నగదు, 7 మొబైల్స్, 4 బైక్ లు స్వాధీనం, 9 మంది పై కేసు నమోదు
నేటి సాక్షి, ప్రతినిధి గద్వాల్ :
గౌరవ జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఐపిఎస్ ఆదేశాల మేరకు గద్వాల్ టౌన్ ఎస్సై కళ్యాణ్ కుమార్, రూరల్ ఎస్సై శ్రీకాంత్ మరియు సిబ్బంది నమ్మదగిన సమచారం మేరకు నిఘా ఉంచి దౌదర్ పల్లి గ్రామ శివారులో పేకాట స్థావరం పై దాడి చేసి 59,390 రూపాయాల నగదు, 7 మొబైల్స్, 4 బైక్ లు స్వాధీనం చేసుకోని 9 మందిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్ తెలిపారు. పేకాట స్థావరంలో పట్టుబడ్డ ముల్లా మహబూబ్, తెలుగు మహేష్, తెలుగు చంద్రములు, తెలుగు వెంకట్రాములు, కుర్వ బొజ్జన్న, తెలుగు శ్రీను, రాఘవేంద్ర, తెలుగు అంజి, తెలుగు నర్సింహులు లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.





