Thursday, March 12, 2026

కొత్త రేషన్ కార్డులపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ

పాత రేషన్ కార్డులపై కీలక నిర్ణయం
కొత్త రేషన్ కార్డుల పై గ్రామాల్లో సర్వే

నేటి సాక్షి, సైదాపూర్:
ఈనెల 26 నుంచి రాష్ట్రంలో అర్హులైన అందరికీ రేషన్ కార్డులను మంజూరు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సైదాపూర్ మండలం దుద్దెనపల్లి, ఎగ్లాస్పూర్, గర్రెపల్లి, సోమవారం, వెన్నంపల్లి గ్రామాలలో ఆయన పర్యటించారు. ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను మంత్రి గారు పరామర్శించారు. అనంతరం ఆయన దుద్దెనపల్లి గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. అర్హత లేని వారికి రేషన్ కార్డులు మంజూరు చేయవద్దని అధికారులను హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఈనెల 26న గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అర్హుల జాబితాను విడుదల చేసి పథకాలను అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మండలంలోని బొమ్మకల్ నుంచి హుజురాబాద్ వరకు రూపాయలు 5.27 కోట్ల నిధులతో తార్ రోడ్డును నిర్మిస్తామని పేర్కొన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయన వెంట సైదాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొంత సుధాకర్ గారు, వేన్కేపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు కొత్త తిరుపతిరెడ్డి గారు, పార్టీ సీనియర్ నాయకులు గుడారం శ్రీనివాస్, మేకల రవీందర్, మిట్టపల్లి కిష్టయ్య, చాంద్ పాషా, లంకదాసరి మల్లయ్య, న్యాడండ్ల రాజ్ కుమార్, బొమ్మగాని రాజు, కూతురు విద్వాన్ రెడ్డి, శ్రీనివాస్, చాడ కొండల్ రెడ్డి, వెంకటేశం, మునిగంటి సంతోష్, వేముల శ్రీనివాస్, గొల్లపల్లి యాదగిరి, వేముల సురేష్, భాస్కర్ నాయక్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వేముల సాయికుమార్, యూత్ కాంగ్రెస్ హుస్నాబాద్ నియోజవర్గ ప్రధాన కార్యదర్శి బోనగిరి అనిల్ గారు, ఆసరి రఘు,తిరుపతి నాయక్,వెంకటేష్,అజయ్, శ్రీనివాస్,రాహుల్, శ్రీ రాగన్ , మణిదీప్, తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News