నేటి సాక్షి, మెట్ పల్లి:
మెట్ పల్లి మండలం పెద్ధాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మాధవీలత సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ గురుకుల కార్యదర్శి రమన కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.పాఠశాలలో విద్యార్థుల ఘటన తర్వాత గత నెల 19న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.కాగా ఆమె సస్పెన్షన్ ఎత్తివేయడమే కాకుండా అదే పాఠశాలకు ప్రిన్సిపల్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.





