నేటిసాక్షి బ్యూరో, నిజామాబాద్, టి ఎన్ రమేష్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో, స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆధ్వర్యంలో, కొనసాగిన మదన్ అన్న కబడ్డీ టోర్నమెంట్లో, గెలుపొందిన హాజీపూర్ తాండ కబడ్డీ జట్టు. శుక్రవారం రోజు సాయంత్రానికి, ఒక్కొక్క కబడ్డీ జట్టును పరాజయం చేస్తూ హాజీపూర్ తాండ కబడ్డీ జట్టు, ఘనవిజయం సాధించింది. మొదటి విజేతగా నిలిచి 51,000 బహుమతిని గెలుపొందారు. అలాగే రెండవ విజేతగా ఎల్లారెడ్డి టీం (A) 21,000 బహుమతి గెలుపొందారు. అలాగే మూడవ విజేతగా జాయింట్ విన్నర్ ( భిక్కనూర్ మరియు మాచపూర్) 11,000 బహుమతి గెలుచుకున్నారు.





