నేటి సాక్షి, మెట్ పల్లి (నరేష్ దూలురి):
మెట్ పల్లి పట్టణంలోని 21 వ వార్డులో జరుగుతున్న వార్డు సభ కార్యక్రమంలో పాల్గొన్న కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. ఎంఎల్ఏ స్టేజి మీద మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగ్ రావు కార్యక్రమానికి వచ్చారు.దీంతో ఎంఎల్ఏ ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమం నడుస్తుండగా మీరు ఎలా వస్తారు అని నరసింగరావు ను అన్నారు.మిమ్మలని కలుద్దామని నేను స్టేజ్ మీదకు వచ్చాను అని నరసింగ రావు తెలపడంతో అక్కడే ఉన్న రెండు పార్టీల కార్యకర్తలు నినాదాలు చేయడంతో అక్కడ గందర గోళం నెలకొంది.





