నేటి సాక్షి, ప్రతినిధి మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్ : తెలియ జేయునది ఏమనగా రేపు అనగా 25 వ తేది శనివారం ఉదయం 10.30గంటల నుండి మధ్యాహ్నం 1వరకు విద్యుత్ వినియోగ దారుల సదస్సు (ప్రత్యేక కోర్టు )పరిష్కార వేదిక కందుకూరు డివిజన్ (33కేవీ విద్యుత్ ఉపకేంద్రం కందుకూరు )ఆవరణలో ఉంటుంది.కందుకూరు, మహేశ్వరం, బాలాపూర్, పహాడిషరీఫ్, అమనగల్, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల కు సంబంధించిన వినియోగ దారులు విద్యుత్ సరఫరా లో తరుచు వచ్చు అంతరాయములు, విద్యుత్ హెచ్చు తగ్గు సమస్యలు, విద్యుత్ మీటర్ సమస్యలు, కొత్త సర్వీస్లు ఇచ్చుటకు నిరాకరణ లేదా జాప్యం, పేరు బదిలీ మరియు క్యాటగిరి మార్పు, విద్యుత్ సరఫరా పునరుద్దరణ, ట్రాన్స్ఫర్మార్ల మార్పిడి, బకాయిల చెల్లింపు, విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఏ ఇతర సమస్యలు అయిన విద్యుత్ చట్టం విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలకు లోబడి తగు విచారణ జరిపిన పిమ్మట పరిష్కరించ బడును.కావున ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోగలరని మనవి.
గోపాల కృష్ణ డిఈ కందుకూరు





