- ఎమ్మెల్యే సంజయ్

నేటి సాక్షి, మెట్ పల్లి : రాజా బహదూర్ వెంకట్రాంరెడ్డి అడుగుజాడల్లో ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు.పట్టణంలో శనివారం రాజా బహదూర్ వెంకటరామారెడ్డి 72వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ మహోత్సవంలో పాల్గొని పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. నిజాం కాలంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వహించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్క్ ఫెడ్ ఛైర్మెన్ లోక బాపూ రెడ్డి, మాజీ ఎంపీపీ మారు సాయి రెడ్డి, తిరుపతి రెడ్డి, మోహన్ రెడ్డి, రెడ్డి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.





