నేటి సాక్షి ప్రతినిధి, వనపర్తి జిల్లా 27 : వనపర్తి జిల్లా మదనాపురం మండలం దంతనూరు గ్రామానికి చెందిన నాగరాజు ఇటీవలే చనిపోవడంతో తోటి స్నేహితులు వారి కుటుంబాని కలిసి పరామర్శించారు. తన స్నేహితుడు కుటుంబానికి ఆర్థిక లోటుబాటును తమ బాధ్యతగా 31500/- ఆర్థిక సహాయం అందించరు. కుటుంబానికి ఎల్లవేళలా సహాయం అవసరం ఉంటే మా సహాయం కోరవచ్చునని మిత్రబృందం వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. తోటి స్నేహితునికి ఆర్థిక సహాయం అందించి నందుకు తమ కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులకు అందరికీ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.





