నేటి సాక్షి, కొడిమ్యాల 28 జనవరి : కొడిమ్యాల మండల కేంద్రం లోని అంబెడ్కర్ విగ్రహం ముందు మంగళవారం మంద కృష్ణ మాదగకి కి పద్మ శ్రీ వచ్చిన సందర్బంగా అంబెడ్కర్ యువజన సంఘము ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసారు, ఈ సందర్బంగా యువజన నాయకులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి అనేక సేవ కార్యక్రమాలు చేయడం, వికలాంగులకు పింఛన్ లు కల్పించడం, చిన్న పిల్లలకు గుండె జబ్బులకు శాస్త్ర చికిత్సలకు సంబదించిన ఆరోగ్య శ్రీ లాంటి రూపొదించడం లో ముఖ్య పాత్ర పోషించిరాని అలాగే ముందు ముందు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నారు. అలాగే ఈ కార్యక్రమం లో లింగాల అజయ్, కట్ల చిరంజీవి, కొత్తూరి శంకర్, కొత్తూరి దేవయ్య, సతీష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.





