Sunday, March 15, 2026

PDSU రాష్ట్ర కోశాధికారిగా కూతాటి రాణా ప్రతాప్ ఎన్నిక

నేటి సాక్షి, కరీంనగర్ :
ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన PDSU వీలీన సభలో కరీంనగర్ జిల్లా నుండి కూతాటి రాణా ప్రతాప్ ను PDSU తెలంగాణ రాష్ట్ర కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ మాట్లాడుతూ….. రాష్ట్ర కోశాధికారిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యా రంగ సమస్యల పైన నిరంతరం పోరాటం కొనసాగిస్తానని అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగం పట్ల నిర్లక్ష్యపు వైఖరి ప్రదర్శిస్తుందని, స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. కార్పోరేట్ విద్యాసంస్థల గుర్తింపు రద్దుచేయాలని, ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. రానున్న రోజుల్లో విద్యారంగ సమస్యల పరిష్కారానికై అలుపెరుగని పోరాటం చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News