నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : అయిజ మండలం టీటీదొడ్డి, ఉత్తనూరులో ఫిబ్రవరి 1 నుంచి జరిగే జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసుకోవాలని శాంతినగర్ సీఐ టాటాబాబు ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. అయిజ పీఎస్లో మంగళవారం ఆయా గ్రామాల ప్రజలతో సమావేశం నిర్వహించారు. రెండు గ్రామాల్లో జరిగే జాతరలకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.





