- 10 కిలోమీటర్లు 34 నిమిషాల్లో….
- తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడోత్సవాళ్ళో మానుకోట జిల్లాకు బంగారుపతకం
- అభినంధించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS
నేటి సాక్షి, మహబూబాబాద్ జిల్లా:
మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న లింగన్న కరీంనగర్ లో జరుగుతున్న మూడవ తెలంగాణా రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లో పది కిలోమీటర్ల పరుగుపందెంలో బంగారుపతకాన్ని గెలుచుకున్నారు. కేవలం 34నిమిషాల్లోనే పదికిలోమీటర్ల పరుగును పూర్తి చేసి బంగారు పతకాన్ని సాధించారు. విజేతగా నిలిచిన ఏఆర్ కానిస్టేబుల్ లింగన్నను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ అభినందించారు





