- శుభాకాంక్షలు తెలిపిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మ్యాకల పర్శరాములు
నేటి సాక్షి, ప్రతినిధి చందుర్తి (సతీష్): జోగాపూర్ గ్రామానికి చెందిన యాస నారాయణ 1989 నుండి కానిస్టేబుల్ గా ఉద్యోగం పొంది ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్ గా చేస్తున్న నారాయణ ఏఎస్సై గా పదోన్నతి పొందండం మా స్వగ్రామ నివాసి అయినందుకు చాలా గర్వం గా ఉంది అని అధ్యక్షులు మ్యాకల పర్శరాములు అన్నారు. అయన తో పాటు కాంగ్రెస్ ఏస్సి సెల్ చందుర్తి మండల అధ్యక్షులు వేల్పుల దేవస్వామి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంటి దాస్, యాస స్వామి తదితరులు ఉన్నారు.





