నేటి సాక్షి, బెజ్జంకి : బెజ్జంకి మండల కేంద్రంలో గురువారం పోలీసులు డాగ్ స్క్వాడ్ తో కిరాణా షాపుల్లో, హోటళ్లు, పలు ఇతర షాపుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మాదక ద్రవ్యాలు, నిషేధిత పదార్థాలు గుట్కా, గంజాయి వంటి మత్తు పదార్థాలను గుర్తించటానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్స్ ను తీసుకువచ్చామని, మాదక ద్రవ్యాలు వాడినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై శంకర్ రావు,పొలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





