నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్): సోమవారం రోజు వసంత పంచమి సందర్భంగా చందుర్తి మండలం లోని మల్యాల మొదటి అంగన్వాడీ సెంటర్లో రెండున్నర సంవత్సరాల పాపకి అక్షరాభ్యాసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మంజుల, అనిత, వివో అధ్యక్షురాలు వనిత, ఆశ వర్కర్ జి మంజుల, అంగన్వాడి విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.





