నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ : ( కోక్కుల వంశీ ) : వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన సెస్ రిటైర్డ్ ఉద్యోగి మద్దూరి రామ్ రెడ్డి తల్లి శంకరవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బుధవారం వారి కుటుంబ సభ్యులను బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. వారి వెంట మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, సింగిల్ విండో ఛైర్మన్ బండ నరసయ్య, భూమరెడ్డి, గోపాల్ రెడ్డి, మల్లారెడ్డి, లింగారెడ్డి, శివతేజ తదితరులు ఉన్నారు.





