
నేటి సాక్షి, మెట్ పల్లి.
అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ మరియు ట్రాక్టర్ ను శనివారం పట్టుకున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.ఉదయం బస్ డిపో వద్ద రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను,పగలు ఎల్లమ్మ వద్ద తనిఖీలు చేస్తుండగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ వైపు అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని పట్టుకున్నట్లు ఓనర్,డ్రైవర్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు నాయక్ పేర్కొన్నారు.





