- రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా లావుడియా రాజు నాయక్
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా, స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసి యేషన్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా లావుడియా రాజు నాయక్ బానోత్ వెంకట్ నాయక్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ లో పనిచేస్తున్న నాయకులు అందరూ క్రమశిక్షణతో ఉండాలని సంఘాన్ని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా వెంకన్న నాయక్ పిలుపు ఇచ్చారు. క్రమశిక్షణ కమిటీ సభ్యులు హనుమకొండ నక్కలగుట్ట ఆఫీసులో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ దేవరాజ్ ఏకంబరం రాష్ట్ర నాయకులు అస్లావత్ విశ్వకుమార్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు హుస్సేన్ నాయక్ ములుగు జిల్లా అధ్యక్షులు వెంకన్న నాయక్ సిద్దు నాయక్ దేవేందర్ నాయక్ భూక్య శ్రావణ్ నాయక్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ నాయక్ అజ్మీర వెంకటేష్ పొరిక రాజేష్ తిరుపతి నాయక్ మొదలైన వారు పాల్గొన్నారు.





