నేటి సాక్షి, కొడిమ్యాల : కొడిమ్యాల మండలం పూడూరు రైతు వేదిక లో ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమం వీడియో కాన్ఫారెన్స్ లో జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత మరియు మామిడి పంట లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి శాస్త్రవేత్తలు వివరించడం జరిగింది. జీవన ఎరువులు మరియు మామిడి పంటకు సంబంధించి ఇతర సందేహాలను శాస్త్రవేత్తలతో వెల్మల రామిరెడ్డి అడిగి తెలుసుకున్నారు.ప్రతి మంగళవారం జరిగే రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు తమకున్న సందేహాలను నేరుగా శాస్త్రవేత్తలతో అడిగి తెలుసుకునే అవకాశం కలదు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి. జ్యోతి, ఏఈఓ లు రాజేష్, శ్రీలత, గ్రీష్మ, రావెప్ విద్యార్థులు మరియు రైతులు పాల్గొన్నారు.





