నేటి సాక్షి, ఆళ్లగడ్డ ప్రతినిధి : ఆళ్లగడ్డ మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో న్ ఈనెల 15న మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్చ దివస్” కార్యక్రమాలను విధిగా నిర్వహించాలని ఆళ్లగడ్డ ఎంపీడీవో మహబూబ్ ఖాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల పరిధిలో కూడా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ఆరోజున ఉద్యోగులకు ఎలాంటి సెలవులు కానీ పర్మిషన్లు గాని ఉండవని ఎంపీడీవో మహబూబ్ ఖాన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను కూడా ఆయన అధికారులకు సమాచారం అందించారు.





