నేటి సాక్షి తిరుపతి జిల్లా, (బాదూరు బాల) : పాకాల మండలం దామల చెరువు పంచాయతీ నల్లానివారి పల్లికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు నారా రమేష్ నాయుడు తల్లి నారా సుశీలమ్మ కర్మ క్రియలకు గురువారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మండల నాయకులతో కలిసి హాజరయ్యారు. అనంతరం నారా సుశీలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





