
నేటి సాక్షి, రాయికల్ : రాయికల్ పట్టణంలోని భీమయ్య యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు ఆహుతలను అలరించాయి. గ్రామ ప్రముఖులు మాజీ కౌన్సిలర్ వళ్లకొండ మహేష్ తురగ శ్రీధర్, మాజీ సర్పంచ్ మచ్చ నారాయణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మ్యకల రమేష్, ప్రెస్ క్లబ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉప అధ్యక్షులు చింతకుంట సాయికుమార్ లు మాట్లాడుతూ.. భీమన్న యూత్ చేపట్టిన సేవలను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వివిధ పాఠశాల విద్యార్థులు వివిధ వేషధారణ లో జానపద సినిమా పాఠశాలకు నిర్వహించిన నృత్యాలు చూసిన ఆహుతులు మంత్ర ముగ్ధులు అయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు సంయుక్త కార్యదర్శి గంగాధరి సురేష్, సీనియర్ జర్నలిస్టు వసం లింబద్రి భీమన్న యూత్ అధ్యక్షులు పల్లికొండ సుధాకర్, ఉప అధ్యక్షులు ద్యవల్ల గంగాధర్, కునరపు భూమెన్, దేవుని నర్సయ్య, ఆర్మూరు శేఖర్ కల్లెడ అశోక్ దేవుని చిన్న రాజం తదితరులు పాల్గొన్నారు.





