- చిత్రలేఖనం చేయించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి


నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో ఉంటూ జ్ఞానాన్ని ఆర్జిస్తు తమ ఆశయ సాధన కోసం కృషి చేస్తుంటారు. అలాంటి పవిత్రమైన ప్రదేశాన్ని పిల్లల ఆశయాలకు అనుగుణంగా వారికి కొత్త ఆలోచనలు, ప్రేరణ కలిగించే విధంగా అందమైన చిత్రలేఖనం చేయించాలి అనుకున్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ హైదారాబాద్ లో ఉండే విజయ్ స్వాతి తో మాట్లాడి అందమైన చిత్ర లేఖనం చేయించారు. అదే విధంగా ప్రభుత్వ వైద్య శాలకు వచ్చే రోగులకు పరిసరాలు అందంగా కనిపించేందుకు వైద్య శాలకు, అదేవిధంగా మెడికల్ కళాశాలకు సైతం ప్రేరణాత్మక చిత్ర లేఖనం చేయిస్తున్నారు. ఇది మన వనపర్తి జిల్లాకు చిరస్మరణీయం లాంటివి.





