
నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్): ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ శనివారం చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో శుభకార్యంలో పాల్గొని బావసాయి పేటకు వెళ్లే క్రమంలో బండపల్లి ఊర చెరువును పరిశీలించి మత్స్యకారులు చేపలు పట్టే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని యువకులు వాలీబాల్ ఆడగా వారీతో కలిసి సరదాగా వాలీబాల్ ఆడారు. అక్కడే ఉన్న బండపెల్లి గ్రామానికి చెందిన న్యాత అనిల్ దివ్యాంగుడు పుట్టకతో కాలు సరిగా లేక నడవడానికి ఇబ్బంది పడుతుండడం గమనించిన ప్రభుత్వ విప్ అతనికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.





