- ఇంచార్జ్ అదనపు ఎస్పీ ఉమామహేశ్వర రావు
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : ప్రతి సోమవారం రోజు వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయములో నిర్వహించే ప్రజావాణిలో భాగంగా ఈరోజు జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి 03 మంది పిర్యాదుదారులు వివిధ సమస్యలపై నేరుగా డిసిఆర్బి డిఎస్పీ, ఇంచార్జ్ అదనపు ఎస్పీ, ఉమామహేశ్వర రావు గారికి ఫిర్యాదులు అందించారు. ఫిర్యాదు చేసిన ప్రతి ఫిర్యాదుపై వనపర్తి డిసిఆర్బి డిఎస్పీ ఇన్చార్జ్ అదనపు ఎస్పీ స్పందించి స్వయంగా ఫిర్యాదును పరిశీలించి సంబంధిత పోలీస్టేషన్ అధికారులకు తక్షణమే సదరు ఫిర్యాదులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని అదేశాలు జారీ చేశారు. దీనితో ఫిర్యాదుదారులకు న్యాయం జరుగుతుందనే బరోసాను కలిగించే విధంగా డిసిఆర్బి డిఎస్పీ చర్యలు తీసుకోవడంపై వచ్చిన ఫిర్యాదుదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ రోజు ప్రజావాణిలో మొత్తం 03 ఫిర్యాదులు 2,భూతగాదాలకు సంబంధించిన ఫిర్యాదులు
1, పరస్పర గొడవకు సంబంధించిన ఫిర్యాదులు వున్నాయి.





