నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : రేణిగుంట విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తిరుపతి ఆశ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో తిరుపతి -2025 కార్యక్రమం ప్రారంభోత్సవానికి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న నేపథ్యంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. డాలర్స్ దివాకర్ రెడ్డి తో పాటు స్థానిక నేతలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, జిల్లా అధికారులు, సీఎం చంద్రబాబు కలిసిన వారిలో ఉన్నారు.





