- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల ( కోక్కుల వంశీ ): ప్రజావాణి అర్జీలకు వేగంగా పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువులోగా వినతులు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలని సూచించారు. ఈ ప్రజావాణిలో వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, డీ.ఆర్డీ.ఓ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.





