నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి మండలంలోని ముత్తన్నపేట గ్రామానికి చెందిన బొర్ర సురేష్ తల్లి బుచ్చవ్వ ఇటీవల మరణించిగా వారి కుటుంబ సభ్యులను మాజీ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ పరామర్శించి, బుచ్చవ్వ చిత్రపటానికి నివాళి అర్పించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వీరితో పార్టీ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, చింతకింది శ్రీనివాస్ గుప్తా, కనగండ్ల తిరుపతి, ఎల శేఖర్ బాబు, కనగండ్ల శ్రీనివాస్,కనగండ్ల శంకర్, పొత్తూరి అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.





