- 15 డప్పుల వితరణ
నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : ( కొక్కుల వంశీ )
స్వగ్రామానికి ఏదో ఒక సాయం చేయాలని ఉద్ధేశ్యంతో మూత్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన తాటికొండ గణేష్ తన తండ్రి తాటికొండ లింగయ్య, వారి అన్న తాటికొండ మహేష్ గార్ల జ్ఞాపకార్థంగా అంబేద్కర్ యువజన సంఘం సభ్యులకు15 డప్పులను అందించడం జరిగింది. ఈ సందర్భంగా తాటికొండ గణేష్ మాట్లాడుతూ.. గ్రామానికి ఏదో ఒక సహాయం చేయాలని ఉద్దేశంతోనే తాను 15 డప్పులను వితరణ చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య, తూము రవీందర్, లక్కాకుల నరేష్, చుక్కల వినోద్, దాసరి శేఖర్, నంచారి రాకేష్, చిడబోయిన మహేష్ మరియు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.




