నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
రేణిగుంట, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకుని శనివారం సాయంత్రం 5.55 గం.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని 6.07 గం.లకు గన్నవరం విమానాశ్రయం కు తిరుగు ప్రయాణం అయిన గౌ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర వీడ్కోలు లభించింది. తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్, తిరుపతి జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఎస్వీ యూనివర్సిటీ విసి ప్రొ.అప్పారావు, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, స్టేట్ యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ మంత్రి పరశ రత్నం, మాజీ ఎంఎల్ఏ సుగుణమ్మ, మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి వర్యులకు సాదర వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.




