- ఘనంగా సత్కరించిన యల్లమంద యువకులు
నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సూచనల మేరకు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులుగా నియమితులైన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. శుక్రవారం ఎర్రావారిపాళెం మండలం యల్లమంద గ్రామానికి చెందిన యువకులు తుమ్మలగుంటకు చేరుకుని నూతన అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డితో పాటు నియోజకవర్గం పార్టీ ఇన్ చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలను గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మీ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేస్తామని యువకులు హామీ ఇచ్చారు. అనంతరం మోహిత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి , యువజన విభాగం నేతలు ఓబుల్ రెడ్డి, కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెంగల్ రెడ్డి, మదనమోహన్ రెడ్డి, భాను వర్ధన్ నాయుడు, రెడ్డి ప్రసాద్ నాయుడు, సుబ్రమణ్యం నాయుడు, వినోద్ నాయుడు, జుబేర్,వీరనాగేంద్ర, తేజేశ్వర్ రెడ్డి, వెంకటరమణ, ప్రవీణ్ కుమార్, లతీష్ కుమార్ నాయుడు,తదితరులు పాల్గొన్నారు.




