నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్): ఎమ్మార్పీఎస్ చందుర్తి మండల శాఖ అధ్యక్షులు తర్రె శంకరయ్య మాదిగ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మర్ణ దినోత్సవం సందర్బంగా స్థానిక ఎస్సీ కాలనీ బస్టాండ్ సర్కిల్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాయకులు ఉపాధ్యక్షులు ఆవునూరి రాజు,ప్రధాన కార్యదర్శి లింగంపల్లి బాబు, ప్రచార కార్యదర్శి కుమ్మరి లక్ష్మణ్, చందుర్తి కుల పెద్దమనిషి నేరెళ్ల దేవయ్య మాదిగ, నేరెళ్ల సురేష్ మాదిగ, నర్సయ్య మాదిగ, రాజు మాదిగ, లచ్చయ్య మాదిగ కుల భాందవులు తదితరులు పాల్గొని మాదిగ అమరవీరులకు ఘననివాళులు అర్పించడం జరిగింది..




