Wednesday, March 25, 2026

పద్మశాలీలకు చట్ట సభలలో ప్రాధాన్యత ఇవ్వాలి

పద్మశాలి మహాసభలను విజయవంతం చేయాలి
జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు సబ్బని రాజేందర్

నేటి సాక్షి, హుజూరాబాద్ ఆర్.సి.(రాఘవుల శ్రీనివాసు):
బీసీ లలో పద్మశాలీలకు జనాభా దామాషా ప్రకారం చట్ట సభలలో ప్రాధాన్యత ఇవ్వాలని పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సబ్బని రాజేందర్ కోరారు. ఆదివారం ఈ నెల 9 న హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే పద్మశాలి మహాసభలకు సంబంధించిన కరపత్రాలను హుజురాబాద్ లోని పద్మశాలి సంఘ భవన్ లో కరపత్రాలను సంఘ నాయకుల తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలి మహాసభ లకు ఇంటికొక్కరు హాజరు కావాలని అన్నారు. కులబాంధవులు సభలలో పాల్గొని ఐక్యత చాటాలని కోరారు. పద్మశాలీల హక్కులను సాదించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో వొడినాల రామకృష్ణ, తౌటం సంపత్, గంజి జయవర్ధన్, సబ్బని శివాజీ, మంచికట్ల వెంకట్రాజం, దాసరి రమేష్, ఆడెపు సూర్యం తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News