నేటి సాక్షి, మెట్ పల్లి : మెట్ పల్లి సర్కిల్ పరిధిలోని మల్లాపూర్ మండలం సాతారం గ్రామము నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.ఇసుక ట్రాక్టర్ అనుమతి లేకుండా మెట్ పల్లికి వస్తుండగా వేంపేట శివారులో ట్రాక్టర్ ను అదుపులోకి తీసుకోని రెవెన్యూ సిబ్బందికి అప్పగించినట్లు పేర్కొన్నారు.ట్రాక్టర్ డ్రైవరు రాంబాబు, ట్రాక్టర్ యజమాని రోహితులపై కేసు నమోద్ చేసినట్లు సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.




