నేటి సాక్షి, మెట్ పల్లి : పట్టణ పరిధిలో జరుగుతున్న పన్ను వసూళ్లను అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి బిఎస్ లతా మంగళవారం పరిశీలించారు.ఈ సందర్బంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ మున్సిపాలిటీకి కట్టవలసిన ఇంటి పన్ను, నల్లా బిల్లు మరియు ట్రేడ్ లైసెన్స్ సకాలంలో చెల్లించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్, టిపిఓ రాజేంద్రప్రసాద్, రెవెన్యూ ఆఫీసర్ మిర్జా అజ్మతుల్లా బేగ్, టిపిఎస్ అశోక్, ఆర్ఐ అక్షయ్, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ సిబ్బంది పాల్గొన్నారు.




