నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి (గుండ ప్రశాంత్ గౌడ్) : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి విజయం సాధించిన సందర్భంగా గొల్లపల్లి మండల కేంద్రంలో టపాసులు కాల్చి స్వీట్లు తినిపిస్తూ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అసెంబ్లీ ఇంచార్జ్ ఖండ అంజన్న అసెంబ్లీ కన్వీనర్ కొమ్ము రాంబాబు బిజెపి మండల అధ్యక్షులు కట్ట మహేష్ సీనియర్ నాయకులు గండ ప్రసాద్ రావు బైరం నారాయణ కొక్కు లక్ష్మణ్ సంకటి గంగరాజ్యం కోట తిరుపతి లక్కాకుల వెంకటేష్ సంఘం కళ్యాణ్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.



