నేటిసాక్షి, కొడిమ్యాల : కొడిమ్యాల మండలం లోని కేజీబీవీ సంద్రళ్లపల్లి స్కూల్ పిల్లలకి పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణి చేసిన మేమున్నాం స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు మొగిలిపాలెం శ్రీనివాస్ విద్యార్థులని ఉద్దేశించి మాట్లాడారు పరీక్షలు దగ్గరబడుతున్న తరుణంలో విద్యార్థులు బాయానికి లోనుకావద్దు కంగారుపడకుండ పరీక్షలు ప్రశాంతంగా రాయాలని వారికి అపోహలు తొలగించాలని ఉపాధ్యాయులని కోరారు. విద్యార్థులు మంచి జి పి ఏ సాధించాలని చిలుకూరు బాలాజీ దేవాలయం లో ఆలయ అర్చకులు ఆత్మరామ్ గురూజీ పూజలు చేసి శ్రీనివాస్.సేవా సంస్థ అధ్యక్షులు వూట్కూరు శ్రీనివాస్ రెడ్డి ద్వారా పెన్నులు పంపించి విద్యార్థులకి అందించారు ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు మొగిలిపాలెం శ్రీనివాస్ ఉపాధ్యక్షులు సురుగు సుదర్శన్ డాక్టర్ జగదీప్ ఎం బి బి ఎస్. కేజీబీవీ స్కూల్ ప్రిన్సిపల్ లావణ్య ఉపాధ్యాయురాళ్లు సుగుణ, రమాదేవి, సప్తరాగిని, పద్మ, రజిని, స్రవంతి, దివ్య తదితరులు పాల్గొన్నారు.



